యాప్నగరం

నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక అసలు కారణం..: రేవంత్

నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక భూకుంభకోణానికి సంబంధించిన చీకటి కోణం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందని అన్నారు.

TNN 12 Feb 2018, 9:16 pm
సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావు అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని కొడంగల్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక ఈ భూమికి సంబంధించిన చీకటి కోణం ఉందని ఆరోపించారు. సోమవారం (ఫిబ్రవరి 12) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్దిదారులకు మేలు చేస్తున్నామనే ముసుగులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై ఆర్డినెన్స్ తేవాలని చూస్తోందని, ఈ ఆర్డినెన్స్ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల భూదందాకు తెరలేపిందని విమర్శించారు.
Samayam Telugu revanth reddy sensational comments on nayeem encounter
నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక అసలు కారణం..: రేవంత్


అసైన్డ్‌ భూములపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే అసెంబ్లీ సమావేశాలను హడావిడిగా ముగించారని రేవంత్ ఆరోపించారు. శంషాబాద్, మహేశ్వరం పరిసరాల్లో 4 వేల ఎకరాల భూమి జూపల్లి రామేశ్వర రావు చేతిలో ఉందని చెప్పారు. హెచ్‌ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని విమర్శించారు.

‘కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం.. చట్టం తేవాలని చూస్తున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక భూకుంభకోణానికి సంబంధించిన చీకటి కోణం ఉందని నా అనుమానం. ఈ భూ దందాపై విచారణ జరిపించాలి’ అని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన ఆరోపణలపై స్పందించాలని, ధైర్యముంటే తనపై కేసులు పెట్టుకోవచ్చునని సవాల్‌ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.