యాప్నగరం

బీజేపీపై ధ్వజమెత్తిన టీడీపీ నేత..!

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గాలు క్రమంగా శత్రువర్గాలు అవుతున్నాయి

TNN 12 Sep 2017, 8:08 am
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గాలు క్రమంగా శత్రువర్గాలు అవుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశంతో తమకు దోస్తీ ఉండదని ఇది వరకే భారతీయ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. ఈ విషయంలో స్వయంగా అమిత్ షా కూడా ప్రకటన చేశారు. టీడీపీతో స్నేహం ఏపీ వరకే అని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇదే మాటే మాట్లాడుతూ ఉన్నారు.
Samayam Telugu revanth reddy slams bjp
బీజేపీపై ధ్వజమెత్తిన టీడీపీ నేత..!


ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీపై ధ్వజమెత్తడం గమనార్హం. బీజేపీతో కలిసి పని చేయాల్సిన అవసరం తమకు లేదని రేవంత్ అన్నారు. ఎమ్ఐఎమ్ నేత అసదుద్ధీన్ ఒవైసీతో సోమవారం సమావేశం అయిన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తీరును తప్పుపట్టారు రేవంత్.

ఢిల్లీ నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు.. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రశంసిస్తారని రేవంత్ అన్నారు. తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ వచ్చి కేసీఆర్ ను ఆకాశానికెత్తారన్నారు. తెలంగాణ బీజేపీ నేతలేమో కేసీఆర్ ను విమర్శిస్తారని.. ఇలాంటి ద్వంద్వ వైఖరితో ఉన్న పార్టీతో తమకు అవసరం లేదన్నారు. బీజేపీ వల్లనే తెలుగుదేశానికి మైనారిటీ ఓట్లు దూరం అయ్యాయని వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.