ఇండియన్ ఐడల్ సీజన్-9 విజేత రేవంత్ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎదుట తన పాటలతో అలరించాడు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ‘బాహుబలి’లోని పాపులర్ సాంగ్.. ‘ఎవ్వడంటా.. ఎవ్వడంటా.. నిన్ను ఎత్తుకుంది’ అంటూ సాగే పాటను పాడి దేశ ప్రథమ పౌరుడిని ఆనందంలో ముంచెత్తాడు. ఈ అద్భుత ఘట్టానికి హైదరాబాద్లోని రాజ్భవన్ వేదికైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్... ఆయన గౌరవార్థం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రానా దగ్గుబాటితో పాటు పలువురు నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రపతి, గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు విందారగిస్తున్న సమయంలో రేవంత్ తన పాటలతో అలరించారు. రాష్ట్రపతి కోవిందుడికి ‘బాహుబలి’ సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా ఆ చిత్రంలోని పాపులర్ పాటను వినిపించే ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి, గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు విందారగిస్తున్న సమయంలో రేవంత్ తన పాటలతో అలరించారు. రాష్ట్రపతి కోవిందుడికి ‘బాహుబలి’ సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కోసం ప్రత్యేకంగా ఆ చిత్రంలోని పాపులర్ పాటను వినిపించే ఏర్పాటు చేశారు.