యాప్నగరం

ఏప్రిల్ 26 నుంచి ఓయూ శతాబ్ధి ఉత్సవాలు

వచ్చే నెల 26 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) శతాబ్ధి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Samayam Telugu 30 Mar 2017, 9:06 pm
వచ్చే నెల 26 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) శతాబ్ధి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రప‌తి ప్ర‌ణబ్ ముఖర్జీ ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా శతాబ్ది బ్లాక్ తో పాటు నూతన వసతి గృహాలు, అకడమిక్ బ్లాకుల నిర్మాణం, గ్రంథాలయం, ప్రయోగశాలల ఆధునికీక‌ర‌ణ పనులకు ప్రణబ్ శంకుస్థాపన చేస్తారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
Samayam Telugu review on osmania university centenary celebrations
ఏప్రిల్ 26 నుంచి ఓయూ శతాబ్ధి ఉత్సవాలు


ఉత్సవాల నిర్వహణపై ఎంపీ కేశవరావు, ఓయూ వీసీ రామచంద్రన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, అధికారులతో కడియం శ్రీహరి గురువారం సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 27న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, 28న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావ‌డేక‌ర్ పాల్గొంటారని కడియం తెలిపారు.

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 3నుంచి 7 తేదీ వరకు ఓయూలో జరగనున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఉత్సవాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కడియం..ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఉత్సవాల సందర్భంగా సదస్సులు, నోబెల్ గ్రహీతలచే ఉపన్యాసాలు, పూర్వవిద్యార్థుల సమ్మేళనం, ఉపకులపతుల సదస్సుతో పాటు ప్రతి రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాం వారసులతో పాటు ఓయూలో చదువుకొని ప్రముఖ స్థానాల్లో ఉన్న వారినీ ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అహ్వానిస్తామని కడియం తెలిపారు.

తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వైభవానికి ఖ్యాతి తెచ్చేలా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ కేశవరావు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.