యాప్నగరం

తెలంగాణ: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్, ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశించింది.

Samayam Telugu 26 Jun 2018, 5:00 pm
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్, ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియను తప్పు బడుతూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బీసీలకు ఏ ప్రాతిపదికన 34శాతం రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే సర్పంచ్, వార్డ్ మెంబర్ల పదవీకాలం ముగిసిందని కూడా తెలియజేశారు.
Samayam Telugu High Court


అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ బీసీ కమిషన్‌ సర్వే నివేదికను ఇవ్వకముందే.. ఫైనాన్స్ కమిషన్ బీసీ నివేదికను ఎలా రూపొందిస్తుందని ప్రశ్నించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్‌లో బీసీ జనాభా 34శాతమని.. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతమని.. సకల జనుల సర్వే గణాంకాల్లో 54శాతం ఉందని.. వీటిలో ఏది నిజమని అడిగింది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్‌ ప్రకారం బీసీ-ఏ, బీ, సీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఏజీకి కోర్టు సూచించింది.

శ్రవణ్ తన పిటిషన్‌లో బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం తప్పుగా చూపిస్తోందని ఆరోపించారు. అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రస్తావించారు. మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.