యాప్నగరం

ఘోరరోడ్డు ప్రమాదం: మంత్రి కేటీఆర్ సాయం

సికింద్రాబాద్‌లో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

TNN 14 Apr 2017, 8:46 am
సికింద్రాబాద్‌లో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో జీహెచ్ఎంసీకి చెందిన డ్రైవర్ ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. రోడ్డుప్రమాదం జరిగిన సమయానికే అటుగా మంత్రి కేటీఆర్ వెళుతున్నారు. ఆయన వెంటనే తన కారును ఆపి... గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల ప్రకారం... గురువారం రాత్రి బన్సీలాల్ పేటకు చెందిన ఎండీ అజహర్ (27) భార్య ఇమ్రాన్ బేగం, కొడుకు అమన్ (9), కూతుళ్లు అశ్వియా (7), అలియా (3), అదియా (2) లతో కలిసి బైక్ పై వెళుతున్నాడు. వారి బైకు ను తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీకి చెందిన చెత్త తరలింపు వాహనం ఢీ కొట్టింది. డ్రైవర్ తాగిన మత్తులో అతి వేగంతో వచ్చి బైక్ ను ఢీ కొట్టాడు.
Samayam Telugu road accident at secunderabad 4 killed
ఘోరరోడ్డు ప్రమాదం: మంత్రి కేటీఆర్ సాయం


ఈ ఘటనలో అజహర్, అతని కొడుకు, ఇద్దరు కూతుళ్లు మరణించారు. భార్య, చిన్న కూతురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే కేటీఆర్ సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. అతను వెంటనే తన కారును ఆపి బాధితులకు సాయం చేశారు. తన కారులోనే తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ బేగం, అదియాలను సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరణించిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పారిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.