యాప్నగరం

చిత్తూరులో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

TNN 11 Mar 2018, 8:34 am
చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బంగారుపాళ్యం మండలం మాదిగవాణి తోపు వద్ద జాతీయ రహదారిపై టెంపోను ఎస్‌ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu road accident in chittoor 4 dead 10 injured
చిత్తూరులో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి


మృతులు కేరళలో కాసర్‌గఢ్‌కు చెందిన సదాశివ (52), గిరిజ (47), పలికల్ గట్టి (72), జప్పగట్టిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కేరళకు చెందిన వీళ్లంతా శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తోన్న వాహనాన్ని బంగారుపాళ్యం సమీపంలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.