యాప్నగరం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం. నలుగురి మృతి

యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 25 Dec 2018, 8:11 am

ప్రధానాంశాలు:

  • గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది
  • కారు ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు
  • వీరిని గుంటూరు జిల్లా గొోరంట్లకు చెందినవారుగా గుర్తించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu accident
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అనసూయ, జయశ్రీ, డ్రైవర్ ఫ్రాన్సిస్‌గా గుర్తించారు. మరో మహిళను గుర్తించాల్సి ఉంది. వీరంగా గోరంట్లకు చెందినవారని పోలీసులు తెలిపారు.
చిలకలూరిపేట మండలం యడ్లవల్లిలో సోమవారం సాయంత్రం జయశ్రీకి సీమంతం నిర్వహించారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు తల్లి అనసూయ, బంధువులతో కలిసి జయశ్రీ ఈరోజు ఉదయం కారులో బయలుదేరింది. డ్రైవర్ అతివేగంతో కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఉన్న ముగ్గురు, ట్రాక్టర్‌పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.