యాప్నగరం

నగరంలో కారు భీభత్సం: ఒకరి మృతి

అదుపు తప్పిన కారు భీభత్సం సృష్టించింది. వాకింగ్ కోసం వచ్చిన వారిపైకి దూసుకెళ్లింది.

TNN 8 May 2017, 8:02 am
అదుపు తప్పిన కారు భీభత్సం సృష్టించింది. వాకింగ్ కోసం వచ్చిన వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడిని సబ్ ఇన్ స్పెక్టర్ కిష్టయ్యగా గుర్తించారు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతంలో జరిగింది. డ్రైవర్ ఎవరో ఇంకా పోలీసులు గుర్తించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఒక కారు అటుగా చాలా వేగంగా వచ్చింది. అతి వేగం వల్ల కారు అదుపుతప్పి... టిప్పుఖాన్ పూల్ బ్రిడ్స్ పైకి దూసుకెళ్లింది. అటుగా వాకింగ్ చేస్తున్న వారిని గుద్దేసింది. ఈ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కిష్టయ్య అక్కడికక్కడే మరణించాడు.
Samayam Telugu road accident in hyderabad si dies on the spot
నగరంలో కారు భీభత్సం: ఒకరి మృతి


కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా... కారు ఆపకుండా డ్రైవర్ అంతే వేగంగా కారును రివర్స్ తీసుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో వాహనాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వచ్చారు. కిష్టయ్య మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల దగ్గర్నించి వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్ ఐ కిష్టయ్య పెళ్లి రోజు కూడా నేడే. అదే రోజు అతను మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.