యాప్నగరం

మైలవరంలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

కృష్ణా జిల్లా మైలవరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

TNN 30 Dec 2017, 5:29 pm
కృష్ణా జిల్లా మైలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు ప్రయాణిస్తోన్న కారు ఆటోను ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మైలవరం దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన పది మంది ప్రార్థన కోసం ఆటోలో వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సమయంలో మైలవరం నుంచి పుల్లూరు వెళ్తున్న ఆటోను తిరువూరు వైపు నుంచి వ‌స్తున్న కారు ఢీకొట్టింది.
Samayam Telugu road accident in mylavaram krishna district
మైలవరంలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి


ఆటోలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు మ‌హిళ‌లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. చికిత్స అందించేందుకు తరలిస్తుండగా.. ఆటో డ్రైవర్ నాగేశ్వర రావు మార్గ మధ్యంలో మరణించాడు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మృతి చెందిన వారిని పుల్లూరుకు చెందిన సగ్గుర్తి లత, గరికపాటి నాగమణి, మందా మేరీగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన కార్లోని విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పాల్వంచలోని ఓ కళాశాలలో వీరు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు సమచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.