యాప్నగరం

తెలంగాణ పోలీసులపై దొంగతనం కేసు

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే చోరీకి బరితెగించిన ఉదంతమిది. తెలంగాణ పోలీసులు తనను కిడ్నాప్ చేసి, తుపాకీతో బెదిరించి అందినకాడికీ దోచుకున్నారని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అక్కడి మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విద్యానగర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. టవేరా వాహనంలో వచ్చిన కొంత మంది పోలీసులు తనను సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో కిడ్నాప్ చేశారని అబ్దుల్ రెహ్మాన్ (45) అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాడు చేశాడు.

TNN 25 Oct 2017, 6:34 pm
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే చోరీకి బరితెగించిన ఉదంతమిది. తెలంగాణ పోలీసులు తనను కిడ్నాప్ చేసి, తుపాకీతో బెదిరించి అందినకాడికీ దోచుకున్నారని కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అక్కడి మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు విద్యానగర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. టవేరా వాహనంలో వచ్చిన కొంత మంది పోలీసులు తనను సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో కిడ్నాప్ చేశారని అబ్దుల్ రెహ్మాన్ (45) అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఇతడు కర్ణాటకలోని శిరబాగిలు ప్రాంత నివాసి.
Samayam Telugu robbery case registered against telangana police
తెలంగాణ పోలీసులపై దొంగతనం కేసు


తనను పోలీసు వాహనంలోకి ఎక్కించుకున్న తర్వాత తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించి.. ఖరీదైన రాడో వాచ్, సెల్ ఫోన్‌లతో పాటు రూ. 14 వేలు నగదును లాక్కున్నారని రెహ్మాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం మోహిన్‌పేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమ కేసు బనాయిస్తామంటూ బెదిరించి, విడిచిపెట్టారని బాధితుడు ఆరోపించాడు.

రెహ్మాన్ ఫిర్యాదును పరిశీలించిన మెజిస్ట్రేట్ కోర్టు.. తెలంగాణ పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ముగ్గురు ఎస్సైలతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైనట్లు సమాచారం. వీరిలో రంగారెడ్డి జిల్లా మోహినిపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు, నవాబ్‌పేటకు చెందిన మరో ఎస్సై ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.