యాప్నగరం

హెచ్‌సీయూలో విద్యార్థుల ర్యాలీ: తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

TNN 17 Jan 2017, 5:40 pm
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏడాది క్రితం యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల వర్ధంతి నేడు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ బయటకు వచ్చి కూడా ఆందోళన నిర్వహించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే అప్పటికీ భారీగా మోహరించిన పోలీసులు, వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విద్యార్థులు వాగ్యుద్ధానికి దిగారు. కాసేపు తోపులాట సాగింది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Samayam Telugu rohit vemula death anniversaryhigh tension at hcu
హెచ్‌సీయూలో విద్యార్థుల ర్యాలీ: తీవ్ర ఉద్రిక్తత


ఒక్క విద్యార్థిపై లాఠీ దెబ్బ పడినా తాను నిరాహార దీక్ష చేస్తానని రోహిత్ తల్లి రాధిక హెచ్చరించారు. ఆవిడ కూడా పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. తాము తీవ్రవాదులమా? ఇలా అడ్డుకోవడానికి అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఆప్ కార్యకర్తలు కూడా హెచ్ సీయూకు వచ్చారు. గేటు బయట ఆప్ కార్యకర్తలు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.