యాప్నగరం

ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ లేనట్లేనా?!

ఏపీ రాజధాని వెలగపూడిలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు.

Samayam Telugu 6 Mar 2017, 12:18 pm
ఏపీ రాజధాని వెలగపూడిలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సమయంలో ఆమె అసెంబ్లీలో వెనుక సీట్లో కూర్చున్నారు. అంతకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడికి బస్సులో వచ్చారు.
Samayam Telugu roja attends ap assembly session at velagapudi
ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ లేనట్లేనా?!


గతేడాది అసెంబ్లీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రివిలేజ్ కమిటీ ఆమెను సంవత్సరకాలం పాటు సభకు హాజరకాకుండా సస్పెండ్ చేసింది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అనితపై కూడా రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ జోక్యంతో ఆమె తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.

అయితే అనిత మరోసారి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కమిటీ మరోసారి రోజాను వివరణ కోరింది. రోజా ఇచ్చిన సమాధానంతో ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందలేదు. దీంతో ఆమెపై మరోయేడాది సస్పెన్షన్ కొనసాగించాలని స్పీకర్ కు నివేదించింది.

అయితే ఏపీలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశంలో ప్రారంభించడంతో...ఆమెపై ఈసారి సస్పెన్షన్ విధించకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ప్రారంభానికి ప్రతిపక్షాలను పిలవలేదని ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. మొన్న ముళ్లపాడులో జరిగిన బస్సు ప్రమాదంపై కూడా జగన్ అధికారులపై మండిపడటం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సహృద్భావ వాతావరణంలో తొలిసారి జరుగుతున్న సమావేశాలను కొనసాగించాలని స్పీకర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అనిత మళ్లీ ప్రివిలేజ్ కమిటీని పట్టుబడితే...వైసీపీతో పాటు రోజా ధోరణిలో ఏలాంటి మార్పు రాకపోతే ఆమెపై సస్పెన్షన్ పొడగించే అవకాశముంది.

రోజాపై మరోయేడాది పాటు సస్పెన్షన్ కొనసాగించాలా వద్దా అనేది స్పీకర్ రేపు (మంగళవారం) నిర్ణయం తీసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.