యాప్నగరం

పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే రోజా అసహనం

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీనటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

Samayam Telugu 31 Mar 2017, 12:31 pm
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీనటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోతే, వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం అలా చేయకపోగా పరిశ్రమ యాజమాన్యానికే మద్దతు పలకడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు రోజా. అంతేకాకుండా తుందుర్రులో ఏర్పాటు చేయనున్న ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం వున్నందున, ఇటువంటి పరిశ్రమల్ని సముద్రం తీర ప్రాంతాలకి తరలించాలని తమ పార్టీ పోరాడుతోందని అన్నారామె.
Samayam Telugu roja comments on pawan kalyan
పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే రోజా అసహనం


తమ నాయకుడు జగన్ ఓవైపు మొగల్తూరు బాధితులకి న్యాయం జరగాలని పోరాడుతోంటే, ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్‌ని తెరపైకి తీసుకొచ్చి సమస్యను పక్కదొవ పట్టిస్తోందని రోజా మండిపడ్డారు. ఇంతజరుగుతున్నా పవన్ కల్యాణ్‌కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని పవన్‌పై అసహనం వ్యక్తంచేశారామె.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.