హైకోర్టు తీర్పును తనకు అనుకూలంగా రావడంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు లో ఊరట లభించడంతో రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సస్పెన్షన్ ఎత్తివేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం కల్పించిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పుతో న్యాయస్థానంపై నమ్మకం రెట్టింపయ్యిందని పేర్కొన్నారు. ఈ విజయ తనది కాదని.. అది నియోజకవర్గ ప్రజలదని వెల్లడించారు. పార్టీ ఏదైనా ప్రజా సమస్యలపై నింతరం పోరాడుతానని పేర్కొన్నారు. సభలో ప్రజల సమస్యలపై గట్టిగా నిలదీస్తాని వెల్లడించారు. ఆర్డర్ కాపీ అందగానే అసెంబ్లీకి వెళ్తానని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
న్యాయస్థానాలపై నమ్మకం రెట్టింపయ్యింది-రోజా
హైకోర్టులో ఊరట లభించగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశం నిర్వహించారు.
TNN 17 Mar 2016, 11:48 am