యాప్నగరం

వరస ప్రమాదాలతో వణికిస్తున్న కాళేశ్వరం సొరంగం

వరస దుర్ఘటనలతో కాళేశ్వరం ప్రాజెక్టు వణికిస్తోంది. 2 రోజుల కిందట ఈ ప్రాజెక్టు సొరంగంలో పైకప్పు కూలి ఏడుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటన మవరక ముందే గురువారం (సెప్టెంబర్ 21) బండరాళ్లు మీదపడి అసోంకు చెందిన మరో కూలీ మృతిచెందాడు. తాజాగా శుక్రవారం మరో ప్రమాదం..

TNN 22 Sep 2017, 7:17 pm
వరస దుర్ఘటనలతో కాళేశ్వరం ప్రాజెక్టు వణికిస్తోంది. 2 రోజుల కిందట ఈ ప్రాజెక్టు సొరంగంలో పైకప్పు కూలి ఏడుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటన మవరక ముందే గురువారం (సెప్టెంబర్ 21) బండరాళ్లు మీదపడి అసోంకు చెందిన మరో కూలీ మృతిచెందాడు. తాజాగా శుక్రవారం మరో ప్రమాదం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్దనున్న సొరంగంలో పనులు చేసేందుకు వెళ్తున్న ఐదుగురి కూలీలపై బండరాలు పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను కరీంనగర్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu roof collapse continuous in kaleshwaram project 1 more killed
వరస ప్రమాదాలతో వణికిస్తున్న కాళేశ్వరం సొరంగం


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం శివారులో ఏడో ప్యాకేజీ సొరంగం పనుల్లో గురువారం జరిగిన ప్రమాదంలో.. అసోంకి చెందిన దేవాజిత్‌ సోనోవాల్‌ (26) మరణించాడు. తలపై బండరాయి పడటంతో తీవ్రంగా గాయపడిన దేవాజిత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.

సొరంగం తవ్వకం పూర్తయ్యాక బండరాళ్లను తొలగించే పని చేస్తుండగా.. పైభాగం నుంచి 10 కిలోలకు పైగా బరువున్న బండరాయి నేరుగా దేవాజిత్ తలపై పడింది. సొరంగంలో చోటు చేసుకుంటున్న వరస సంఘటనలతో కూలీలు ఠారెత్తిపోతున్నారు.

Also Read: కూలీల కుటుంబాల్లో కన్నీరు నింపిన కాళేశ్వరం..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.