యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే జేబు నుంచి రూ.30 వేలు చోరీ.. చిన్న తిరుపతిలో చేదు అనుభవం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఓ దొంగ చేతివాటం చూపించాడు.

Samayam Telugu 15 Jun 2019, 7:25 pm

ప్రధానాంశాలు:

  • రూటు మార్చిన దొంగలు.
  • వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రావు జేబు గుల్ల.
  • ద్వారకా తిరుమలలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu talari
ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
దొంగలు రూటు మార్చారు. వీఐపీలు, సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ ఎమ్మెల్యే దొంగల బారినపడ్డారు. చేతివాటం చూపిన ఓ చోరీగాడు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జేబు నుంచి నగదు కొట్టేశాడు. రూ.30 వేల నగదు తస్కరించినట్లు తెలుస్తోంది. చిన్న తిరుపతిగా పేరు పొందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో దైవ దర్శనం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ శుక్రవారం (జూన్ 14) ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేశారు. ఆయనతో పాటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావు ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం వీరంతా వెలుపలకు వస్తుండగా.. తూర్పు రాజగోపురం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించారు. ఎమ్మెల్యే వెంకట్రావు జేబులో నుంచి డబ్బులు కొట్టేశాడు. విషయం ఆలస్యంగా తెలుసుకొని ఎమ్మెల్యే వెంకట్రావు విచారం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.