యాప్నగరం

బలహీన వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు

బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Samayam Telugu 18 Jan 2017, 11:44 am
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల ఉపాధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
Samayam Telugu rs 550 cr to be released by march 31 says cm kcr
బలహీన వర్గాల సంక్షేమానికి భారీగా నిధులు


‘‘ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం కేటాయించిన రూ. 500 నుంచి 550 కోట్లు ఈ మార్చి 31 వరకు విడుదల చేస్తాం. ఎస్సీ సబ్ ప్లాన్ లో కేంద్రం కొత్త పంథా అవలంభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర ఖర్చుల తగ్గించుకొని వారికి న్యాయం చేస్తాం. వచ్చే సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులపై అన్ని వర్గాల శాసన సభ్యులతో చర్చించి బడ్జెట్ రూపకల్పన చేస్తాం. ఏ స్కీంలో ఏయే ఎంత మేరకు నిధులు కేటాయించాలో అప్పుడే నిర్ణయిస్తాం’’అని కేసీఆర్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.