యాప్నగరం

పెరగనున్న ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరియు కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి...

TNN 22 Jun 2016, 6:05 pm
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరియు కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి. టీఎస్ ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థల ఆదాయం, వ్యయం మరియు నష్టాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సామాన్య, గృహ వినియోగదారులపై భారం పడకుండా పెంపు ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌పై 100 యూనిట్లలోపు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని, 100 యూనిట్లు దాటితే స్వల్పంగా పెంచాలని అధికారులకు సిఎం సూచించారు. పరిశ్రమలకు 7 శాతం లోపే పెంపు ఉండాలని చెప్పారు.
Samayam Telugu rtc and power charges hike
పెరగనున్న ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలు


మరోవైపు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో 10 శాతం ఛార్జీలు పెరగనున్నాయి. 30 కిలో మీటర్ల లోపు దూరానికి రూపాయి, 30 కిలో మీటర్లు దాటితే రూ. 2 వరకు పెరగనుంది. ఐతే ఇతర సర్వీసుల్లో మాత్రం ఛార్జీల పెంపు 10 శాతానికి మించరాదని సీఎం సూచించారు. ధరల పెంపుపై గురువారం ప్రకటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.