యాప్నగరం

సదావర్తి భూములు ఆయన సొంతం ఇక!

అనేక మలుపుల అనంతరం సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తోంది.

TNN 23 Sep 2017, 8:21 am
అనేక మలుపుల అనంతరం సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. ఒకవైపు ఈ భూముల వ్యవహారం గురించి సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ కొనసాగగా, ఇదే సమయంలో సత్రం భూములను కొనడానికి వేలంలో పోటీ పడ్డ వ్యక్తి కొనుగోలుకు సగం మొత్తాన్ని జమ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భూములను అరవై కోట్ల ముప్పై లక్షల రూపాయలకు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మొదట వేలం పాడిన సంగతి తెలిసిందే. బహిరంగ వేలంలో ఈ మొత్తాన్ని పాడి అతడు భూములను కొనుగోలు చేశాడు. అయితే వేలం పూర్తయ్యాకా ఆయన మాట మార్చారు. తను భూములను కొనడం లేదని ప్రకటించాడు.
Samayam Telugu sadavarti bidder paid half of the money
సదావర్తి భూములు ఆయన సొంతం ఇక!


ఈ నేపథ్యంలో వేలంలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం దక్కింది. మొదటి వ్యక్తి కొనలేదు.. కొనే ఆసక్తి ఉందా? అని ఆయనను అడుగగా ఆయన సమ్మతం తెలిపారు. బహిరంగ వేలంలో ఈ వ్యక్తి అరవై కోట్లా 25 లక్షల రూపాయల వరకూ పాడారు. ఇప్పుడు అదే మొత్తానికి భూమిని దక్కించుకుంటున్నారు. ఆయన పేరు చదలవాడ లక్ష్మణ్.

ఇప్పటికే ఆయన వేలం పాటలో పాడిన మొత్తంలో సగం మొత్తాన్ని జమ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సదావర్తి సత్రం ఈవో కూడా ధ్రువీకరించారు. దాదాపు ముప్పై కోట్ల రూపాయల మొత్తాన్ని చదలవాడ లక్ష్మణ్ జమ చేశాడని సదావర్తి ఈవో పేర్కొన్నారు. మరి ఈ స్థాయిలో చెల్లింపు జరిగిన నేపథ్యంలో ఈ భూమి ఆయన సొంతం అవుతున్నట్టే అనుకోవాలి.

మరోవైపు సదావర్తి బహిరంగ వేలంలో భూముల విలువ భారీ పెరగడాన్ని స్వాగతించింది సుప్రీం కోర్టు. ఇంకోవైపు ఈ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కమ్యూనిస్టు పార్టీ నేత నారాయణ సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.