యాప్నగరం

శ్రీనివాసుడి సేవలో.. సమంత, ప్రముఖులు

వీఐపీ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

TNN 20 May 2017, 2:25 pm
ప్రముఖ సినీనటి సమంత శనివారం ఉదయం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం ముగించుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమెను చూడటానికి అభిమానులు పోటీలు పడ్డారు. దీంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. దేవాలయ సిబ్బంది సమంతను అభిమానుల బారి నుంచి తప్పించి తీసుకెళ్లారు.
Samayam Telugu samantha visits tirumala
శ్రీనివాసుడి సేవలో.. సమంత, ప్రముఖులు




ఇతర ప్రముఖులు కూడా శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో ఉభయ రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఉన్నారు. కుటుంబ సమేతంగా భన్వర్ లాల్ శ్రీవారిని దర్శించుకున్నారు.


​ ఏపీ మంత్రి దేశినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి సతీశ్ చంద్ర కూడా సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.