యాప్నగరం

‘అమ్మ’ భాషకు అందలం.. ఈ సైకత శిల్పం

ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో అద్భుత కళాఖండాన్ని నిర్మించిన సైకతశిల్పి.

TNN 21 Feb 2017, 5:33 pm
సాధారణంగా భారత్‌లో సైకతశిల్పి అంటే అందరికీ గుర్తొచ్చేది సుదర్శన్ పట్నాయక్. ఒడిశాకు చెందిన ఈ దిగ్గజ సైకతశిల్పి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేక సందర్భాల్లో అద్భుతమైన సైకతశిల్పాలను నెలకొల్పి అందరి చూపును తనవైపు తిప్పుకుంటారు. అయితే ఈసారి సుదర్శన్ పట్నాయక్ కాకుండా మరో సైకతశిల్పి ఇసుకతో అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎల్.ఎన్.‌పేట గ్రామ సమీపంలో వంశధార నదీ తీరంలో నిర్మించిన ఈ సైకతశిల్పం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
Samayam Telugu sand artist tarani prasad mishra created sand sculpture on the concept of international mother language day
‘అమ్మ’ భాషకు అందలం.. ఈ సైకత శిల్పం


శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకతశిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వివిధ భాషలకు చెందిన అక్షరాలతో దీన్ని నిర్మించారు. ఈ శిల్పంలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఒరియా, స్పానిష్, అరబిక్, రష్యన్, చైనా భాషల అక్షరాలతోబాటు ప్రపంచ సార్వత్రిక భాష అయిన దృష్యకళకు చిహ్నంగా పుష్పాన్ని పొందుపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.