మహిళ అన్న కనీస జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు ఓ సర్పంచ్. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మహిళను చితక్కొట్టాడు. అందుకు ఇద్దరు, ముగ్గురు గ్రామస్తులు సహకరించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఓ గ్రామస్థుడు తీసిన వీడియో ద్వారా ఇప్పుడు విషయం బయటికి వచ్చింది. అనంతపురం జిల్లాలోని కూడేరు మండలం, జల్లిపల్లిలో సుధ అనే మహిళ నివసిస్తోంది. కాగా పశువుల కోసం నీళ్ల తొట్టిని సుధకు చెందిన భూమిలో నిర్మించాలని సర్పంచ్ నాగారాజు నిర్ణయించాడు. దానికి సుధ ఒప్పుకోలేదు. తన స్థలంలో తొట్టె నిర్మిస్తే ఊరుకోనని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ ఆమెపై దాడి చేశాడు. కాలిలో తన్నాడు. ఆమె అరుస్తున్నా కూడా ఎవరూ ఆమెకు సాయంగా రాలేదు. అంతా చోద్యం చూస్తూ నిలుచున్నారు. ప్రస్తుతం మహిళ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అనంత: మహిళపై సర్పంచ్ దౌర్జన్యం
మహిళ అన్న కనీస జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు ఓ సర్పంచ్.
TNN 2 Feb 2017, 3:21 pm