యువ ఐపీఎస్ అధికారి... పాడేరు ఏఎస్పీ శశికుమార్ అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. రివాల్వర్ ప్రమాదవశాత్తూ పేలి ఆయన మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అని ఇంతవరకు అనుమానాలు రేకెత్తాయి. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కాగా... అధికారులు ఆయన ఛాంబర్లో తనఖీలు చేయగా... ఓ ఆత్మహత్య లేఖ దొరికింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మూడు నెలలుగా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నా’ అని లేఖలో రాసినట్టు పోలీసులు వెల్లడించారు. శశికుమార్ మూడు నెలల క్రితమే పాడేరులో ఏఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు నాలుగునెలల్లో పెళ్లి కూడా ఉంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.
పాడేరు ఏఎస్పీది ఆత్మహత్యే...
యువ ఐపీఎస్ అధికారి... పాడేరు ఏఎస్పీ శశికుమార్ అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే.
TNN 17 Jun 2016, 3:09 pm