యాప్నగరం

జైలు నుంచి సత్యంబాబు విడుదల

పోలీసులు, రాజకీయ నేతల ప్రోద్భలంతో అయేషామీరా హత్య కేసులో నిందితుడిగా దాదాపు ఎనిమిదిన్నరేళ్ల పాటు

Samayam Telugu 1 Apr 2017, 3:03 pm
పోలీసులు, రాజకీయ నేతల ప్రోద్భలంతో అయేషామీరా హత్య కేసులో నిందితుడిగా దాదాపు ఎనిమిదిన్నరేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన పిడతల సత్యంబాబు శనివారం విడుదలయ్యారు. అయేషా హత్య కేసుతో సత్యంబాబుకు ఏలాంటి సంబంధం లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్యంను తీసుకెళ్లేందుకు తల్లి మరియమ్మ, అతని తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది శ్రీనివాస్ జైలుకు వచ్చారు.
Samayam Telugu sathyam babu released from rajahmundry jail
జైలు నుంచి సత్యంబాబు విడుదల


చేయని నేరానికి 8ఏళ్లపాటు శిక్ష అనుభవిస్తూ ఎంతో మానసిక క్షోభను అనుభవించిన సత్యంబాబును ఆలస్యంగానైనా నిర్దోషిగా విడుదలవడంతో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని న్యాయవాది శ్రీనివాస్ అన్నారు. సత్యంబాబుపై తప్పుడు కేసు బనాయించింది పోలీసులేనని ఆయన ఆరోపించారు.

ఇప్పటికైనా సత్యంబాబు కుటుంబాన్ని ఆదుకోని...అయేషా కేసులో అసలైన నిందితులను పట్టుకునేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

తన కుమారుడు నిర్దోషిగా బయటకు రావడం సంతోషంగా ఉందని సత్యంబాబు తల్లి మరియమ్మ అన్నారు.

హైకోర్టు తీర్పు డాక్యుమెంట్లను రాజమండ్రి జైలు అధికారులు పరిశీలించిన మీదట సత్యంబాబును విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.