యాప్నగరం

జైలు బయట మీడియాతో మాట్లాడిన సత్యం బాబు

ఆయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లుగా జైలులో వున్న సత్యం బాబు ఇవాళ ఉదయం నిర్ధోషిగా విడుదలయ్యారు.

Samayam Telugu 2 Apr 2017, 11:44 am
ఆయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లుగా జైలులో వున్న సత్యం బాబు ఇవాళ ఉదయం నిర్ధోషిగా విడుదలయ్యారు. రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం సత్యం బాబు జైలు వద్ద వున్న మీడియాతో మాట్లాడారు. అంతిమంగా న్యాయమే గెలిచిందన్న సత్యం బాబు.. ఇన్నేళ్లపాటు తన కోసం, తనని విడిపించడం కోసం అంతా ఏకమై న్యాయపోరాటం జరిపిన తన గ్రామస్తులు, శ్రేయోభిలాషులకి కృతజ్ఞతలు తెలిపారు. తనకి న్యాయం జరగడం కోసం చేసిన పోరాటంలో గ్రామస్తులంతా ఇంటింటికీ రూ.200 చొప్పున పోగేసుకుని మరీ తనకి సహాయపడ్డారని, వారి మేలు ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు సత్యం బాబు.
Samayam Telugu sathyam babu speaks to media after releasing from rajahmundry central jail
జైలు బయట మీడియాతో మాట్లాడిన సత్యం బాబు


"ఏనాడూ పోలీసు స్టేషన్, కోర్టు మెట్లెక్కని నా తల్లి, నా కోసం ఇంత కాలం న్యాయపోరాటం చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగారు. నా కోసం నా తల్లి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె స్థానంలో మరొకరు వుంటే అంత శ్రమ పడేవారో కాదో తెలీదు కానీ నా తల్లి మాత్రం అవిశ్రాంతపోరాటం చేశారు. ఆమె పేగు తెంచుకుని పుట్టిన నేను ఇకపై ఆమె కోసమే బతకాలి. 70 ఏళ్ల వృద్ధురాలైన నా తల్లికి ఇకపై ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. నా చెల్లి పెళ్లి చేయాలి'' అని చెబుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు సత్యం బాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.