యాప్నగరం

ఎస్‌బీఐనే మోసం చేసిన 3 సాఫ్ట్‌వేర్ సంస్థలు

రుణాలు పొందడం కోసం అసైన్డ్ భూమని తమ భూమిగా చూపించి బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బురిడీ...

TNN 29 Oct 2017, 9:14 pm
రుణాలు పొందడం కోసం ప్రభుత్వ భూమని తమ భూమిగా చూపించి బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బురిడీ కొట్టించాయి మూడు సాఫ్ట్‌వేర్ సంస్థలు. అసైన్డ్ భూమిని తమదిగా చెప్పుకుని బ్యాంకుని నమ్మించిన ఆ సంస్థలు.. ఆ భూమిని తనఖా పెట్టి రూ. 23.42 కోట్ల మొత్తాన్ని రుణంగా పొందాయి.
Samayam Telugu sbi gets cheated by three it firms for mortgage loan
ఎస్‌బీఐనే మోసం చేసిన 3 సాఫ్ట్‌వేర్ సంస్థలు


విశాఖపట్నంలో జరిగిన ఈ గోల్‌మాల్ లోన్ బాగోతంపై అక్కడి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్లోబల్ టెక్ ప్రొ సొల్యూషన్ ప్రై.లిమిటెడ్, మమత్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రై.లిమిటెడ్, హచ్ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ అనే మూడు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు రుణం కోసం విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించాయి. రుణం మంజూరు చేయడం కోసం సెక్యురిటీగా అసైన్డ్ భూములని తమ సంస్థల సొంత భూములుగా చూపించాయి. అందుకోసం నకిలీ ధృవపత్రాలు సైతం సృష్టించారు ఆయా సంస్థల యజమానులు.

ఆయా సంస్థలు చెప్పిన మాటలు నమ్మిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు వారు కోరుకున్నట్టుగానే వేర్వేరుగా మొత్తం రూ. 23.42 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. అయితే, రుణం మంజూరు చేశాకా కానీ తాము మోసపోయామనే విషయం అధికారులకి తెలిసిరాలేదు. దీంతో జరిగిన ఘటనపై దరఖాస్తుదారులుగా వున్న ఆ మూడు సంస్థల డైరెక్టర్లపై పోలీసులకి ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మూడు సంస్థల డైరెక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.