యాప్నగరం

‘ధర్మయుద్ధం’ దద్ధరిల్లాలి: మందకృష్ణమాదిగ

‘ధర్మయుద్ధం’ పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ద్వారా కేంద్రరాష్ట్రాల ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధినేత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Samayam Telugu 28 Oct 2016, 10:33 am
షెడ్యూల్డు కులాల (ఎస్సీ) రిజర్వేషన్లలను ఏబీసీడీలుగా వర్గీకరించి అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న ‘ధర్మయుద్ధం’ పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ద్వారా కేంద్రరాష్ట్రాల ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధినేత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
Samayam Telugu sc reservations must be rationalised say manda krishna
‘ధర్మయుద్ధం’ దద్ధరిల్లాలి: మందకృష్ణమాదిగ


వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలని చేయాలని కోరుతూ నవంబర్ 20న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో సైకిల్ యాత్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాజ్యాంగం ప్రసాదించిన ఎస్సీ రిజర్వేషన్లను అన్ని కులాలు సమానంగా అనుభవించాలని అదే అంబేద్కర్ ఆశించారని, ఏ కులం అధికంగా అనుభవించడానికి వీల్లేదని మందకృష్ణ స్పష్టం చేశారు.

ఈసారి నిర్వహించబోయే ‘ధర్మయుద్ధమే’ అంతి యుద్ధమని, దానితోనే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆయన అన్నారు. 30లక్షలమంది మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలతో సభ జరిపి తమ ఆక్రందన ప్రభుత్వం అర్థం చేసుకునేలా చేస్తామని ఆయన చెప్పారు.

రాజకీయంగా అన్ని పార్టీలు తమ న్యాయబద్ధమైన డిమాండ్ కు మద్దతునిస్తున్న కొన్ని శక్తులు పార్లమెంటులో కుట్రలు పన్నుతున్నాయని వాటిని తిప్పికొడతామని ఆయన ఉద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.