యాప్నగరం

శనిదోషం పోగొడతానని.. ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేయబోయాడు

అమాయక ప్రజలని దొంగ బాబాలు ఎలా ఇబ్బందులపాలు చేస్తున్నారో, వారి నమ్మకాలని క్యాష్ చేసుకుంటూ వారిని ఎలా మోసం చేస్తున్నారో...

TNN 27 Sep 2017, 12:48 am
తమనే నమ్ముకుని తమ వద్దకు వచ్చిన అమాయక ప్రజలని దొంగ బాబాలు ఎలా ఇబ్బందులపాలు చేస్తున్నారో, వారి నమ్మకాలని క్యాష్ చేసుకుంటూ వారిని ఎలా మోసం చేస్తున్నారో మరోసారి నిరూపించిన ఘటన ఇది. శనిదోషం పోగొట్టాలని వేడుకుంటూ తాను హైద‌రాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో నివాసం వుంటున్న దత్త పీఠమ్ అధిపతి శ్రీరామ్ శర్మని ఆశ్రయిస్తే, అతడు తన అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఓ మహిళ హైదరాబాద్ లోని నాచారం పోలీసులని ఆశ్రయించింది.
Samayam Telugu self styled god man booked in molesting a woman devotee
శనిదోషం పోగొడతానని.. ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేయబోయాడు


నాచారం సీఐ విఠల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారంకు సమీపంలోని హెచ్ఎంటీ నగర్‌లో నివాసం వుంటున్న ఓ మహిళ గతం కొంతకాలంగా వివధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారు. శ్రీరామ్ శర్మ చేసే ప్రత్యేక పూజలతో శనిదోషం తొలగిపోతుందని కొంతమంది స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఆమె అతడిని ఆశ్రయించింది. మహిళ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన శ్రీరామ్ శర్మ.. ఆమె వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వసూలు చేశాడు.

అంతేకాకుండా హెచ్ఎంటీ నగర్‌లోని ఆమె ఇంట్లోనే ప్రత్యేక పూజల పేరిట ఆమెని వివస్త్రగా మార్చి మోసం చేసేందుకు కుట్రపన్నాడని, అతడి కుట్రల్ని పసిగట్టిన బాధిత మహిళ ఆ తర్వాత తమకు ఫిర్యాదు చేశారని నాచారం సీఐ మీడియాకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీ‌రామ‌ శర్మపై 354,420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.