యాప్నగరం

అమిత్ షాను కలిసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి.. జగన్ సర్కార్‌లో పనిచేస్తారట!

ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డితో సమావేశం.. తన డిప్యుటేషన్‌పై చర్చించినట్లు సమాచారం. అమిత్ షాను కలిసినట్లు ప్రచారం.

Samayam Telugu 23 Jul 2019, 5:01 pm
జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గుర్తున్నారా.. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. జైలు జీవితంలో అనారోగ్యం పాలై.. ఈ కేసు నుంచి బయటపడి మళ్లీ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉన్న ఆమె తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రావాలని భావిస్తున్నారు. వైసీపీ సర్కార్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిప్యుటేషన్‌పై తనను తిరిగి పీకి పంపాలని కోరుతున్నారు. తాజాగా ఆమె పార్లమెంట్ ఆవరణలో కనిపించారు.
Samayam Telugu srilakshmi.


పార్లమెంట్‌కు వెళ్లిన శ్రీలక్ష్మి వైసీపీ ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారట. తన డిప్యుటేషన్ అంశంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉండటంతో.. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారట. అనంతరం విజయసాయి శ్రీలక్ష్మిని వెంటబెట్టుకొని వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారట. డిప్యుటేషన్‌‌కు సంబంధించిన అంశంపై చర్చించారట. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆమె గతంలోనే డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారట.. కానీ ఏపీకి బదిలీ చేసే ప్రక్రియలో అడ్డంకులు ఎదురుకావడంతో అమిత్ షాను కలిశారు. తర్వాత పీఎంవో అధికారుల్ని కూడా కలిసినట్లు తెలుస్తోంది. డిప్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునే ముందు శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాను ఏపీకి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు.. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అప్పుడే ఆమె ఏపీకి తిరిగి రాబోతున్నారని ప్రచారం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.