యాప్నగరం

వనపర్తి: రెండు కార్లు ఢీకొని ఏడుగురి దుర్మరణం

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు.

TNN 21 Feb 2018, 11:36 am
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారు వేగంగా డివైడర్‌ను ఢొకొట్టింది. దీంతో అదుపుతప్పి అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు కార్లలో మొత్తం 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu seven killed 4 hurt as cars collide at kanimetta
వనపర్తి: రెండు కార్లు ఢీకొని ఏడుగురి దుర్మరణం


ఈ ప్రమాదంతో జాతీయ రహదారి భయానకంగా మారింది. రెండు కార్లు నుజ్జునుజ్జువడంతోపాటు కొన్ని మృతదేహాలు వాటిలో ఇరుక్కుపోయాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.