యాప్నగరం

ఎదురుకాల్పుల్లో 7గురు మావోయిస్టుల మృతి

మావోయిస్టులకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది.

TNN 21 Feb 2017, 6:27 pm
మావోయిస్టులకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ పూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. చాలా సేపు ఆ అటవీప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లింది. కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాలకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. ఇరు వర్గాలు ఒకరికి ఒకరు ఎదురవ్వడంతో కాల్పులు మొదలయ్యాయి. భద్రతా దళాలు ఏడుగురి మావోయిస్టులను కాల్చి చంపాయి. మిగతా వారు అక్కడ్నించి పరారయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu seven maoists killed in encounter in chhattisgarh
ఎదురుకాల్పుల్లో 7గురు మావోయిస్టుల మృతి


భద్రతాదళాలు కూడా తమ సహచరుల మృతికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది. ఈ నెల మొదటి వారంలో విశాఖ పట్నం - రాయ్ పూర్ వెళ్లే రహదారిలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టి బీఎస్ఎఫ్ దళాలు వెళుతున్న బస్సును పేల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది జవానులు మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.