యాప్నగరం

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది.

TNN 18 Apr 2017, 7:47 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టింది. తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. నేడో రేపో మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు బదిలీ చేయనున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఐఏఎస్ అధికారుల బదిలీలపై కొన్ని వారాలు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం రాత్రి ఒక కొలిక్కి రావడంతో అర్థరాత్రి బదిలీలు చేస్తున్నట్టు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. సీఎం కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న ప్రద్యుమ్నను చిత్తూరు కలెక్టర్ గా నియమించారు. ముఖ్యామంత్రి కార్యదర్శిగా ఎం. గిరిజా శంకర్ ను నియమించారు. ఈయన ఇంతవరకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న వినయ్ చంద్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా నియమించారు. అనంతపురంలో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మీ కాంతంను కృష్ణా జిల్లా కలెక్టర్ గా నియమించారు.
Samayam Telugu several ias officers shuffled in andhrapradesh
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు


సిద్ధార్ట్ జైన్ - కమిషనర్, పరిశ్రమలు

కార్తికేయ మిశ్రా - తూర్పుగోదావరి కలెక్టర్

కె. ధనుంజయ రెడ్డి - శ్రీకాకుళం కలెక్టర్

జి.వీరపాండ్యన్ - అనంపురం కలెక్టర్

కోన శశిధర్ - గుంటూరు కలెక్టర్

ఎస్. సత్యనారాయణ - కర్నూలు కలెక్టర్

టి. బాబూ రావు నాయుడు - కడప కలెక్టర్

హెచ్. అరుణ్ కుమార్ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్

కె.వి సత్యానరాయణ - సీఈవో, నైపుణ్యాభివృద్ధి సంస్థ

పి. లక్ష్మీ నరసింహం - ప్రత్యేక కమిషనర్, ఎక్సైజ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.