యాప్నగరం

టీటీడీలో వేధింపుల కలకలం.. ఏఈవోపై పోలీసులకు మహిళా ఉద్యోగి కూతురు ఫిర్యాదు

టీటీడీలో మహిళా ఉద్యోగిని కూతురిపై లైంగిక వేధింపులు కలకలంరేపుతున్నాయి. ఏఈవో తనను వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 23 Aug 2018, 3:11 pm
టీటీడీలో మహిళా ఉద్యోగిని కూతురిపై లైంగిక వేధింపులు కలకలంరేపుతున్నాయి. ఏఈవో తనను వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళ అటెండర్‌గా పనిచేస్తోంది. అయితే కొంతకాలంగా ఏఈవో శ్రీనివాసులు తన కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని ఉద్యోగిని ఆరోపించింది. ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆయనకు లొంగకపోతే మీ అమ్మను బదిలీ చేస్తానంటూ బెదిరించాడని ఆరోపించింది.
Samayam Telugu Ttd


మరోవైపు ఈ లైంగిక వేధింపులపై గతంలోనే ఉద్యోగిని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసిందట. దీనిపై అంతర్గత విచారణ కూడా జరిపిన విజిలెన్స్ అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారట. శ్రీనివాసులపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయట.. టీటీడీ బదిలీ వేటు కూడా వేసినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.