జయరామ్ హత్యకు ఆయన మేనకోడలు శిఖా చౌదరి ప్లాన్ చేసిందని పద్మ శ్రీ ఆరోపించారు. తమ ఆస్తుల కోసమే ప్రియుడితో కలిసి శిఖా చౌదరి తన భర్తను హత్య చేసి ఉండొచ్చాన్నారు. అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదన్నారు. శిఖా వ్యవహారం చూశాక, ఆమె నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడ్డానని పద్మ శ్రీ తెలిపారు. శిఖా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని పద్మ శ్రీ ఆరోపించారు. అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టకరం అన్నారు. తన భర్త హత్య గురించి తెలిశాక శిఖా చౌదరి నందిగామ వెళ్లకుండా తమ ఇంటికొచ్చి కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకెళ్లడాన్ని పద్మ ఆక్షేపించారు. ఈ విషయమై ఇప్పటికే ఆమె జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న పద్మ శ్రీ... జయరాంకి అతడు నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడం వాస్తవం కాదన్నారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని అన్న ఆమె.. జయరామ్ అంత్యక్రియలకు ఆయన తరఫు దగ్గర బంధువులెవరూ రాలేదన్నారు. శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తెలంగాణ పోలీసులు తేల్చాలని ఆమె కోరారు.
శిఖా చౌదరి అమాయకురాలని దేవుడు వచ్చి చెప్పినా తాను నమ్మలేనని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు. తన భర్త స్త్రీ లోలుడనే ప్రచారం సరికాదన్నారు. జయరామ్కు, నాకు విబేధాలు ఉంటే 30 ఏళ్లుగా ఎలా కలిసి ఉంటామని పద్మ శ్రీ ప్రశ్నించారు.
రాకేష్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న పద్మ శ్రీ... జయరాంకి అతడు నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడం వాస్తవం కాదన్నారు. శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని అన్న ఆమె.. జయరామ్ అంత్యక్రియలకు ఆయన తరఫు దగ్గర బంధువులెవరూ రాలేదన్నారు. శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తెలంగాణ పోలీసులు తేల్చాలని ఆమె కోరారు.
శిఖా చౌదరి అమాయకురాలని దేవుడు వచ్చి చెప్పినా తాను నమ్మలేనని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు. తన భర్త స్త్రీ లోలుడనే ప్రచారం సరికాదన్నారు. జయరామ్కు, నాకు విబేధాలు ఉంటే 30 ఏళ్లుగా ఎలా కలిసి ఉంటామని పద్మ శ్రీ ప్రశ్నించారు.