యాప్నగరం

​నంద్యాల్లో ఓటు వేసిన శిల్పా కుటుంబం

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి,

TNN 23 Aug 2017, 7:59 am
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుటుంబీకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే శిల్పా కుటుంబీకులు ఓటు వేశారు. శిల్పా మోహన్ రెడ్డి కొడుకు, కూతురు, కోడలు ఆయన వెంట వచ్చి ఓటేశారు. నంద్యాల టౌన్ సంజీవ్ నగర్ పోలింగ్ బూత్ నంబర్ 81లో శిల్పా కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది.
Samayam Telugu shilpa and his famly cost their vote
​నంద్యాల్లో ఓటు వేసిన శిల్పా కుటుంబం


బూత్ లోని ఏజెంట్లతో శిల్పా మోహన్ రెడ్డి కరచాలనం చేశారు. ఓట్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు. నిన్నరాత్రి తమ ఇంటిపై జరిగిన పోలీసుల దాడే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దౌర్జన్యాలకు ప్రజలు సమాధానం ఇవ్వాలన్నారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మీరు ఎవరికి ఓటు వేశారనే విషయం మరెవరికీ తెలియదని.. ఎవరికీ భయపడకుండా ఓటు వేయాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.