యాప్నగరం

నంద్యాలలో ఎగిరేది వైసీపీ జెండానే.. ఎనీడౌట్స్

నంద్యాల కురుక్షేత్ర సంగ్రామంలో వైసీపీ గెలిచి.. జెండా పాతేయటం ఖాయం అన్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి.

TNN 23 Aug 2017, 7:55 pm
నంద్యాల కురుక్షేత్ర సంగ్రామంలో వైసీపీ గెలిచి.. జెండా పాతేయటం ఖాయం అన్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. ఈరోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లో సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ.. భారీగా ఓటింగ్ నమోదు కావటంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే దాడులకు తెగబడుతున్నారని, వాళ్లు ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో ఉంటున్నాం అన్నారు.
Samayam Telugu shilpa mohan reddy press meet about nandyal by election
నంద్యాలలో ఎగిరేది వైసీపీ జెండానే.. ఎనీడౌట్స్


ఓటింగ్ రోజున కూడా ఓటర్లను మభ్య పెట్టడానికి టీడీపీ ప్రయత్నించిందని అందుకోసం స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు రంగలోకి దిగారన్నారు. ఇక జగన్‌పైన నమోదైన కేసు గురించి మాట్లాడుతూ ఆరోపణలు చేసినపుడు ప్రతిఆరోపణలు ఉంటాయని ఫ్లోలోనే జగన్ అలా మాట్లాడారని అయితే న్యాయం తమవైపే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిష్ఫక్షపాతంగా వ్యవహరిందన్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా ప్రజలు శిల్పాసోదరుల వైపు సైనికుల్లా పనిచేశారన్నారు. కులాలను మతాలను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలను భయపెట్టినా ప్రజలు తమవైపే నిలిచారని చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మా సోదరుడు గెలవడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.