యాప్నగరం

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బీ1, బీ2 బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

Samayam Telugu 7 Feb 2019, 10:19 pm
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బీ1, బ2 బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో లైట్లు పగిలిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును న్యూజివీడు దగ్గర నిలిపేశారు. లోకో‌పైలెట్ సకాలంలో స్పందించడంతోపాటు, సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.
Samayam Telugu tirumala express


కడప వాసులు విశాఖకు రాకపోకలు సాగించడానికి వీలుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే తిరుపతి నుంచి కడప వరకూ పొడిగించారు. ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు వైజాగ్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు కడప చేరుకుంటుంది. కడపలో సాయంత్రం 5.05 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.