యాప్నగరం

రాజ్యసభ: ఏపీ సమస్యలపై చర్చ రేపటికి వాయిదా

ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌లో పోరాటం కొనసాగుతోంది. లోక్‌సభలో అవిశ్వాసంతో టీడీపీ హీటెక్కిస్తే.. ఇవాళ రాజ్యసభలో వైసీపీ, టీడీపీలు దూకుడు పెంచాయి. ఏపీ సమస్యలపై సభలో చర్చించాలంటూ రెండు పార్టీలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి.

Samayam Telugu 23 Jul 2018, 12:36 pm
ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌లో పోరాటం కొనసాగుతోంది. లోక్‌సభలో అవిశ్వాసంతో టీడీపీ హీటెక్కిస్తే.. ఇవాళ రాజ్యసభలో వైసీపీ, టీడీపీలు దూకుడు పెంచాయి. ఏపీ సమస్యలపై సభలో చర్చించాలంటూ రెండు పార్టీలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభంకాగానే చర్చకు టీడీపీ ఎంపీలు పట్టుబట్టుగా.. రేపు చర్చిద్దామని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. కొంతమంది సభ్యుల మేరకే వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయినా ఎంపీలు వెనక్కు తగ్గకపోవడంతో సభను 45 నిమిషాల పాటూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు.
Samayam Telugu Rajya Sabha


అంతకముందు టీడీపీ, బీజేపీలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై ఏపీకి ద్రోహం చేశాయని.. ఇప్పుడు రాజకీయాల కోసం టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకి ఓ ప్రణాళికంటూ లేదని.. వైసీపీ మాత్రం స్పష్టమైన విధానంతో మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు కూడా స్పెషల్ ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నారని.. ఆయన కోరిక మేరకు కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ ప్యాకేజీని సమర్థిస్తూ ఆయన తీర్మానాన్ని కూడా పెట్టారని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.