యాప్నగరం

నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు

Samayam Telugu 25 Jun 2017, 4:11 pm
కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డిని తమ అభ్యర్థిగా దింపుతున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించింది.
Samayam Telugu silpa mohan reddy finalised as nandyala candidate of ysrcp
నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి


భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల స్థానం ఖాళీ అయింది. 2014 వైసీపీ తరపున గెలిచిన భూమా అనంతరం అధికార టీడీపీలో చేరారు. మూడు నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. టీడీపీలో కొనసాగిన శిల్పామోహన్ రెడ్డి నంద్యాల టికెట్ ఆశించారు. అయితే టీడీపీ అదిష్టానం భూమా కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో అలిగిన శిల్పా.. వైసీపీలో చేరారు. నంద్యాల టిక్కెట్ కన్ ఫర్మ్ చేసుకున్నాకే ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ నంద్యాలకు ఆయన్నే బరిలోకి దించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.