యాప్నగరం

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తా

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మానసభలో పీవీసింధు మాట్లాడారు.

TNN 23 Aug 2016, 1:56 pm
విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మానసభలో పీవీసింధు మాట్లాడారు. అందరి సహకారంతో భవిష్యత్తులో తాను మరిన్ని విజయాలు సాధించి ముందుకు వస్తానని తెలిపారు. తన విజయానికి కోచ్ గోపీచంద్, తల్లిదండ్రులే కారణమని అన్నారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అది తన తాతగారి ఊరని, వేసవి సెలవులకి అక్కడికి వచ్చేదాన్నని తెలిపారు. గోపీచంద్ ఆడడం చూసి చాలా స్పూర్తి పొందానని, బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యానని చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ... కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ కాంస్యం గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సన్మానం కార్యక్రమం నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. తాను కూడా అలా బాగా ఆడి సన్మానం చేయించుకోవాలని ఆనాడే అనుకున్నానని చెప్పారు. ఆ స్పూర్తితోనే బాగా ఆడేవాడినని చెప్పారు. సింధుతో పాటూ తనకు సన్మానం చేస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సింధు, గోపీచంద్ లను శాలువా కప్పి సత్కరించారు ఏపీ సీఎం, మంత్రులు. సింధుకు రూ.3 కోట్ల చెక్ ను, గోపీ చంద్ కు రూ.50 లక్షల చెక్ ను సాయంత్రం కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో అందించనున్నారు.
Samayam Telugu sindhu speech at felicitation dias in vijayawada
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.