యాప్నగరం

​ నేను ఊహించని రెస్పాన్స్ ఇది : సింధూ

భారత వెండి కొండ సింధూకి తెలంగాణ ప్రభుత్వం శాలువా కప్పి సన్మానం చేసింది.

TNN 22 Aug 2016, 1:50 pm
భారత వెండి కొండ సింధూకి తెలంగాణ ప్రభుత్వం శాలువా కప్పి సన్మానం చేసింది. ఆమెతో పాటూ కోచ్ గోపీచంద్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సింధు ఓ నిమిషం పాటూ మాట్లాడింది. రియో నుంచి హైదరాబాద్ వచ్చాక ఇంత రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని తెలిపారు. అందరి అభిమానం ఇలాగే ఉంటే భవిష్యత్తులో తాను మరిన్ని పతకాలు సాధించి తెలుగు ప్రజల ముందు నిలుస్తానని చెప్పారు. కోచ్ తల్లిదండ్రులు తనను చాలా పోత్సహించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సింధు అనంతరం కోచ్ గోపీచంద్ మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే క్రీడాకారులు మరింతగా రాణిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందాయని, ఇదే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. తాను గతంలో కరణం మల్లీశ్వరి ఒలింపిక్ పతకం పొందినప్పుడు స్పూర్తిని పొందానని, అలాగే ఎంతో మంది పిల్లలు ఇప్పుడు సింధుని చూసి స్పూర్తిని పొందుతారని అన్నారు. పతకాలు సాధించి... దేశ గౌరవాన్ని నిలబెట్టిన సింధు, సాక్షి మాలిక్‌లకు శుభాకాంక్షలు చెప్పారు.
Samayam Telugu sindhu speech at gmc stadium
​ నేను ఊహించని రెస్పాన్స్ ఇది : సింధూ


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.