యాప్నగరం

జీఎంసీ మైదానానికి చేరుకున్న పీవీ సింధు

పీవీ సింధు విజయోత్సవ ర్యాలీ గచ్చిబౌలిలోని జీఎంసీ స్టేడియానికి చేరుకుంది.

TNN 22 Aug 2016, 12:51 pm
పీవీ సింధు విజయోత్సవ ర్యాలీ గచ్చిబౌలిలోని జీఎంసీ స్టేడియానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రహదారుల వెంబడి సింధుని పలకరించేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, ప్రజలు, స్కూలు విద్యార్థులు బారులు తీరారు. అందరి మన్ననలు అందుకున్న సింధు గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంది. అక్కడ ఆమెకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. పేరిణి నృత్యాకారులు, ఒగ్గు డోలు వాయిద్య కళాకారులు తమ కళారూపాలతో ఆమెకు స్వాగతం పలికారు. స్కూలు విద్యార్థులు త్రివర్ణాల్లో ఉన్న బెలూన్లను పట్టుకుని సింధు రాగానే ఆనందంతో గాలిలోకి వదిలారు. అనంతరం పూలతో అలంకరించిన ఓపెన్ టాప్ జీపులో ఆమె స్టేడియంలో ట్రాక్ మీద తిరుగుతూ... వచ్చిన వారందరికీ అభివాదం తెలిపింది. కొన్ని నిమిషాల్లో స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ ప్రభుత్వం ఆమెను సత్కరించబోతోంది. అనంతరం రూ.5కోట్ల నజరానాను అందించనున్నారు. మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
Samayam Telugu sindhus victory parade reaches gmc ground
జీఎంసీ మైదానానికి చేరుకున్న పీవీ సింధు



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.