యాప్నగరం

తెలంగాణ గని ‘సింగరేణి’కి మరో అంతర్జాతీయ అవార్డు

తెలంగాణ ‘బంగారు’ గని ‘సింగరేణి’ని మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి గుర్తింపు లభించింది.

Samayam Telugu 27 Aug 2018, 8:18 pm
తెలంగాణ ‘బంగారు’ గని ‘సింగరేణి’ని మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి గుర్తింపు లభించింది. ఆదివారం (ఆగస్టు 26) సాయంత్రం బ్యాంకాక్‌లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ బి భాస్కర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. సింగరేణికి అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సిబ్బందికి వారు అభినందనలు తెలిపారు.
Samayam Telugu singareni


అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ 2018 సంవత్సరానికి ఆసియాలో విశ్వసనీయ కోల్ మైనింగ్ కంపెనీ అవార్డుకు (Asia's Most Trusted Company 2018) ‘సింగరేణి కాలరీస్’ కంపెనీని ఎంపిక చేసింది. సింగరేణి సంస్థ అనతి కాలంలోనే అద్భుత ప్రగతిని సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసియ ఖండంలోనే ఉత్తమ శ్రేణి ప్రతిభావంతమైన సంస్థ సింగరేణి అని నిర్వహకులులు ప్రసంశలు కురిపించారు.

తెలంగణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడచిన 4 ఏళ్లలో సాధించిన వెగవంతమైన ప్రగతి, వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఖనిజాన్ని సరఫరా చేస్తూ అత్యంత విశ్వసనీయ కంపెనీగా సింగరేణి ఎదిగిందని.. అందుకే మొత్తం 500 కంపెనీలను వడబోసి సింగరేణిని జ్యూరీ వారు ఎంపిక చేశారని భాస్కరరావు తెలిపారు.

సిబ్బంది సమష్టి కృషి, సంస్థ సీఎండీ శ్రీధర్ సమర్థ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని భాస్కర రావు అన్నారు. ఇలాగే విజయాలు సాధిస్తూ ముందుకు పోతామని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.