నటరత్న, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను విధించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. 2015లో జయకృష్ణపై చెక్ బౌన్స్ కేసు రిజిస్టర్ అయ్యింది. సుమారు రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. అయితే జయకృష్ణ పైకోర్టులో అప్పీల్ చేసుకునే విధంగా నెలరోజులపాటు బెయిల్ మంజూరు చేసింది.
అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించి నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్లోని మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు ఇప్పటి వరకు స్పందించలేదు.
అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించి నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్లోని మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు ఇప్పటి వరకు స్పందించలేదు.