యాప్నగరం

ఫారెస్ట్ అధికారులపై స్మగ్లర్ల రాళ్ల దాడి!

దేవరకొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు.. తమిళనాడుకు చెందిన 31 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు.ఫారెస్ట్ అధికారులను గమనించిన స్మగ్లర్లు వారి నుంచి తప్పించుకోవడానికి రాళ్లదాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయారు.

Samayam Telugu 7 Dec 2022, 1:18 pm
ఫారెస్ట్ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్ల దాడికి పాల్పడ్డ ఘటన శేషాచలం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. దేవరకొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో భాకరాపేట అటవీశాఖ అధికారులకు.. తమిళనాడుకు చెందిన 31 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దీంతో ఫారెస్ట్ అధికారులను గమనించిన స్మగ్లర్లు.. వారి నుంచి తప్పించుకోవడానికి వారిపై రాళ్లతో దాడికి పాల్పడి.. అక్కడి నుంచి పారిపోయారు.
Samayam Telugu Red Sandal


ఘటనా స్థలంలో 25 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన తమిళ స్మగ్లర్ల కోసం అదనపు బలగాలు శేషాచలం అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.