యాప్నగరం

దళిత చైతన్యానికి ప్రతీక.. భాగ్యరెడ్డివర్మ!

జీవితమంతా దళితుల అభ్యున్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ '130 జయంతి' నేడు (మే 22). ఈ సందర్భంగా నేటి తరానికి ఆదర్శమైన ఆయన జీవితాన్ని, ఆయన చేసిన సేవలను ఓసారి స్మరించుకుందాం.

Samayam Telugu 22 May 2018, 2:26 pm
జీవితమంతా దళితుల అభ్యున్నతికి కృషిచేసిన భాగ్యరెడ్డివర్మ '130వ జయంతి' నేడు (మే 22). ఈ సందర్భంగా నేటి తరానికి ఆదర్శమైన ఆయన జీవితాన్ని, ఆయన చేసిన సేవలను ఓసారి స్మరించుకుందాం. హైదరాబాద్‌లో 'ఆది ఆంధ్ర సభ', 'ఆది హిందూ సోషల్ సర్వీసు లీగ్' స్థాపకుడైన భాగ్యరెడ్డివర్మను తెలంగాణ వైతాళికుడిగా చెప్పవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారిచూపి, దేశంలో అంబేద్కర్ కంటే ముందే దళిత చైతన్యానికి నాంది పలికిన మహానుభావుడు ఆయన. ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, రచయితగా, పాత్రికేయుడిగా, సంఘసంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి మన భాగ్యరెడ్డివర్మ.
Samayam Telugu bhagyaReddyVarma


1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి.. బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారు. దళితుల అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి.. సంఘసంస్కరణకు కృషిచేశాడు. మద్యపాన నిషేధం, గ్రంథాలయాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో తనదైన ముద్రవేశారు.

తెలంగాణ ప్రభుత్వం భాగ్యరెడ్డివర్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ, ఆది-హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భాగ్యరెడ్డివర్మ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని గుర్తుచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.