యాప్నగరం

పండగ బొనాంజా.. ప్లాట్‌ఫాం టిక్కెట్‌ రేట్ డబుల్!

పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఓ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.10గా ఉన్న ఈ టికెట్ ధరను ఏకంగా రూ.20కి పెంచేశారు. ఈ ధరల పెంపు గురువారం (సెప్టెంబర్ 21) నుంచి అక్టోబర్‌ 13 వరకు..

TNN 20 Sep 2017, 9:44 pm
పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఓ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.10గా ఉన్న ఈ టికెట్ ధరను ఏకంగా రూ.20కి పెంచేశారు. ఈ ధరల పెంపు గురువారం (సెప్టెంబర్ 21) నుంచి అక్టోబర్‌ 13 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. దసరా, దీపావళి వరస సెలవుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu south central railway doubles platform ticket rate in secunderabad station
పండగ బొనాంజా.. ప్లాట్‌ఫాం టిక్కెట్‌ రేట్ డబుల్!


మామూలుగానే రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. పండగ సమయాల్లో జనంతో కిక్కిరిసిపోతుంది. ప్రయాణికుల సంఖ్యకు సమానంగా వారిని సాగనంపేవారూ ఉంటారు. దీంతో రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడం ఈ టికెట్ పెంపు నిర్ణయానికి ఒక కారణం కాగా.. ప్రత్యేక వడ్డింపు ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడం మరో కారణం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.