సికింద్రాబాద్, కాచీగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ఫాం ధర పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ఫాం ధరను తాత్కాలికంగా రూ.10 నుంచి 20కి పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ధరలు ఈ నెల 10 తేదీ నుంచి 16 తేదీ వరకు అమల్లో ఉంటాయని, 16 తేదీ అనంతరం తిరిగి ధర.10 ఉంటుందని తెలిపారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు కాకుండా ఇతరులు రైల్వే స్టేషన్ లోపలికి రావద్దని అధికారులు సూచించారు.
ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.20
ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10
Samayam Telugu 6 Jan 2017, 12:31 pm