యాప్నగరం

బాబు రమ్మన్నా, అఖిలప్రియ రాలేదా?

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు మరోసారి రచ్చకు ఎక్కాయి.

Samayam Telugu 25 Apr 2018, 4:52 pm
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు మరోసారి రచ్చకు ఎక్కాయి. మంత్రి అఖిలప్రియపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ విరుచుకుపడ్డారు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి. తమ మధ్యన విభేదాల పరిష్కారానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంత్రి అఖిలప్రియను పిలిచినా ఆమె రాలేదని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu bhoomaakhila


ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేయబోగా, ఆయనపై కొంతమంది రాళ్లు రువ్వారు. ఇదంతా మంత్రి కుట్ర అని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో తనను తిరగనీయకుండా అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ, ఏవీల మధ్య మరోసారి రచ్చ మొదలైంది. దీనిపై మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు తామిద్దరినీ రమ్మన్నారని సుబ్బారెడ్డి చెబుతున్నారు.

అందుకే తను విజయవాడ వచ్చాను అని, అయితే మంత్రి మాత్రం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అఖిలప్రియ ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఏవీ అన్నారు. తండ్రి లాంటి తన మీద ఆమె రాళ్లు రువ్వించిందని, ఇప్పుడు చంద్రబాబు రమ్మన్నా రాలేదని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని తను అన్నాను అని, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాను అన్నాను తప్ప, తనంతకు తాను పోటీ చేస్తానని అనలేదని ఏవీ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.